SDT 15: మిస్టరీ థ్రిల్లర్ సినిమాతో సాయిధరమ్ తేజ్ బ్యాక్

-

రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న హీరో సాయిధరమ్ తేజ్.. మళ్లీ సినిమాల్లో అడుగుపెట్టారు. రిపబ్లిక్ సినిమా విడుదలైన తర్వాత పూర్తిగా కోలుకున్న సాయిధరమ్ తేజ్.. మళ్లీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ షురూ చేశారు. ఎస్‌డీటీ-15 వర్కింగ్ టైటిల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. కేవలం 25 రోజుల్లోనే 30 శాతం షూటింగ్ పూర్తయినట్లు సినీ బృందం పేర్కొంది. కాగా, ఈ సినిమా తర్వాత మిగిలిన సినిమాల షూటింగ్‌పై సాయిధరమ్ తేజ్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్

ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. షూటింగ్ సమయంలో తీసిన ఒక ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. చెట్ల మధ్యలో నుంచి వస్తున్న వెలుతురులో సాయిధరమ్ తేజ్ అండ్ టీమ్ షాడోస్ కనిపిస్తున్నాయి. ఈ ఫోటోను చూస్తే సినీ మిస్టరీ థ్రిల్లర్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ థ్రిల్లర్ సినిమా చేస్తుండటం ఇదే తొలిసారి. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానుల్లో ఆతురత ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్ అందరిలో ఆసక్తి రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news