నుపుర్ శర్మకు మద్దతుగా కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

-

మహమ్మద్ ప్రవక్త పై వ్యాఖ్యలు చేసి తీవ్ర ఆగ్రహానికి గురవుతున్న బిజెపి మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ కు మరోసారి మద్దతు పలికింది బాలీవుడ్ భామ కంగనా రనౌత్. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఈ భామ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.” నాకు చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. వారు మద్యం తాగుతారు, ధూమపానం చేస్తారు.

వారిలో పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్న వారు ఉన్నారు. వారు బురఖాలు ధరించరు. బూతులు మాట్లాడుతారు. పంది మాంసం తింటారు. వాళ్లు అలాంటి వాతావరణంలో పని చేస్తుంటారు. వాళ్లు అన్ని నియమాలు పాటించరు కూడా. భారతదేశంలో ఉన్న స్వేచ్ఛాయుత వాతావరణ సౌందర్యం ఇదే.నుపుర్ ఒక్క దాన్నే నేరస్తురాలిగా చేయడం కాదు.. ప్రతి ఒక్కరూ క్రిమినల్ గా మారుతున్నారు.” అని కంగనా తన ఇంస్టాగ్రామ్ లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news