మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా రానా వైఫ్ !

-

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేదాని పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మహేష్ బాబు, పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మహేష్ బాబు కరోనా బారిన పడడం అలాగే.. ఆయన అన్నయ్య మరణించడం తో ఈ ప్రాజెక్టు మొదలు కావడానికి చాలా లేట్ అయింది.

ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు త్రివిక్రమ్ టీం ప్లాన్ చేస్తోందట. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఆమె చెల్లెలు పాత్రకు మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో… సంయుక్త రానా భార్యగా నటించింది. ఆమె టాలెంట్ కు ఫిదా అయిన త్రివిక్రమ్… మహేష్ బాబు మూవీ లో ఆమెకు కీలక ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. ఈ మేరకు ఇప్పటికే దీనిపై చర్చలు జరిగాయని ఈ ఆఫర్ ను సంయుక్త కూడా యాక్సెప్ట్ చేసినట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version