డీఆర్డోఓ ఛైర్మన్ గా తెలుగు వ్యక్తి

-

రక్షణ శాఖలో ఎంతో కీలకమైన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ) ఛైర్మన్ గా సతీశ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సంబంధిత శాఖ ఉత్తర్వూలు జారీ చేసింది. ప్రస్తుతం రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు హోదాలో ఉన్నారు.1 జూలై  1963లో  నెల్లూరు జిల్లాలో జన్మించి సతీశ్ రెడ్డి అనంతపురంలో బీటెక్, జేఎన్టీయూహెచ్ లో ఎంఎస్ పూర్తి చేశారు. 1985లో డీఆర్డీఓలో చేరిన ఈయన నావిగేషన్, ఏవియానిక్స్ టెక్నాలజీ రంగాల్లో పరిశోధనలు చేశారు. మనోహర్ పారీకర్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో సలహాదారుగా నియమితులయ్యారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నుంచి హోమీ జహంగీర్ బాబా స్మారక అవార్డును అందుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక సార్లు సత్కారాలు అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news