సిబ్బందికి కరోనా.. SBI బ్యాంకు బంద్

-

గండీడ్: మహమ్మదాబాద్ మండల కేంద్రంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా సోకడంతో.. బ్యాంకు సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. బ్యాంకులో పనిచేసే మిగతా సిబ్బంది సైతం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కొన్ని రోజుల అనంతరం యథావిధిగా బ్యాంకు సేవలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అప్పటివరకు ప్రజలు దీన్ని గమనించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version