ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం

-

అమరావతి : ఆగస్టు నెల 16 నుంచి పాఠశాలల పున : ప్రారంభం చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన నాడు -నేడు సమీక్ష లో ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడత నాడు- నేడు పనులను కూడా అదే రోజు ప్రజలకు అంకితం చేయాలని నిర్ణయం తీసుకున్నారు సిఎం జగన్.

ఆరోజే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే నూతన విద్యా విధానంపై సమగ్రంగా అదే రోజు వివరించనుంది ఏపీ ప్రభుత్వం. విద్యార్థులకు విద్యా కానుక కిట్టులు కూడా వచ్చే నెల 16 నుంచి అందజేయనుంది ఏపీ విద్యా శాఖ. అయితే పాఠశాలల పున : ప్రారంభం నేపథ్యంలో అన్ని కరోనా మహమ్మారి నియమ నిబంధనాలు పాటించాలని  అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. మాస్కులు మరియు బౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు సిఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version