కాంగ్రెస్ పార్టీ హిప్పోక్రసీ చూస్తుంటే ఆవేదన కలుగుతోంది : కేటీఆర్

-

కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది అంటూ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో కేటీఆర్ ధ్వజమెత్తారు.ఎమర్జెన్సీ నాటి నుంచి ఇప్పటివరకు నయవంచనకు ప్రతిరూపం కాంగ్రెస్ అంటూ ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ”పౌర, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రజల గొంతులను అణిచివేస్తూ 49 సంవత్సరాల క్రితం ఇదేరోజు దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ఇన్ని దశాబ్దాలు గడిచినా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై అదే దాడిని కొనసాగిస్తూనే ఉంది అని మండిపడ్డారు. ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూ పార్లమెంట్ లో రాజ్యాంగ కాపీలను ఆ పార్టీ నేతలు చేత పట్టుకొని ప్రదర్శన చేస్తారు అని విమర్శించారు. మరోవైపు అదే పార్లమెంట్ కు కొద్ది దూరంలోనే ఉన్న వాళ్ల పార్టీ ఆఫీస్ లో రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసే విధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాజ్యాంగం గురించి మాట్లాడతారో.. అదే రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీసేలా వ్యవహరించే కాంగ్రెస్ పార్టీ హిప్పోక్రసీ చూస్తుంటే ఆవేదన కలుగుతోంది అని,నయవంచనకు ప్రతిరూపమే కాంగ్రెస్” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version