ఈసారి ఆ జట్టుకి టి20 వరల్డ్ కప్ గెలిచే సత్తా ఉంది : షోయబ్‌ అక్తర్‌

-

టీ20 వరల్డ్ కప్ -2024లో టీమిండియా లీగ్‌, సూపర్‌-8 దశలో ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా సెమీ ఫైనల్‌ చేరుకుంది. కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కి చేరుకుంది.ఈ క్రమంలో ఫైనల్‌లో అడుగుపెట్టేందుకు.. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ లో తలపడనుంది.సెయింట్‌ లూసియా వేదికగా గురువారం(జూన్‌ 27) ఈ మ్యాచ్‌ జరుగనుంది.

ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్ -2023లోనే రోహిత్‌ ట్రోఫీ గెలవాల్సిందని.. ఈసారి కూడా టీమిండియాకే గెలిచే అర్హత ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ”ఇండియా అద్భుతంగా ఆడింది. ఇది మీ వరల్డ్‌కప్‌. ఈసారి మీరు కచ్చితంగా గెలవాలి. ఉపఖండంలోనే ప్రపంచకప్‌ ట్రోఫీ ఉండాలి.ఇటీవలే మంచి అవకాశం మిస్‌ అయ్యారు. ఈసారి మాత్రం వందకు వంద శాతం మీకే టైటిల్‌ గెలిచే అర్హత ఉంది. నా పూర్తి మద్దతు మీకే అని అన్నారు. రోహిత్‌ వ్యూహాలు బాగున్నాయి. ట్రోఫీ గెలిచేందుకు అతడు అర్హుడు అని రోహిత్ శర్మ పై ప్రశంసల జల్లు కురిపించారు.వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీమిండియా , ఈసారి డిప్రెషన్‌ నుంచి బయటపడి ప్రత్యర్థిని సరైన సమయంలో దెబ్బకొట్టింది” అని షోయబ్‌ అక్తర్‌ టీమిండియా క్రికెటర్లని ఆకాశానికెత్తాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version