జనసైకోలు మీరు పవన్ భ్రమలో పడ్డారు.. ఎమ్మెల్సీ దువ్వాడ సంచలన వ్యాఖ్యలు

-

జనసైకోలు మీరు పవన్ భ్రమలో పడ్డారు.. మీరు ఇబ్బందులు పడుతారని  ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణంలో రూ.118 కోట్లు అవినీతి ఆరోపణల్లో చంద్రబాబు ఉన్నాడు. త్వరలో ప్రజా దర్బార్ పెడతానన్న పవన్ కళ్యాణ్ దీని పై నిలయదేయగలడా.?15 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు ఎందుకు..? జన సైకోలు మీరు వాడి భ్రమలో పడి ఉన్నారు.. ప్రశ్నిస్తానంటున్న పవన్ కళ్యాన్ మీ చంద్రబాబు వ్యవహారం పై ఎందుకు ప్రశ్నించరు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ని నమ్మె పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. సీఎం జగన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి అంతకంటే అధిక సీట్లు వస్తాయని పేర్కొన్నారు. పవన్ కళ్యాన్ చంద్రబాబు భ్రమలో పడి ప్రజలు చీదరించుకునేలా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా మారాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version