అమెరికాలో ఓ ఎన్నారై ఘాతుకం…నలుగురిని మట్టుబెట్టి…

-

అమెరికాలో జరిగిన ఓ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.శాన్ఫ్రాన్సిస్కో లో జరిగిన ఈ ఘటనపై చుట్టుపక్కల వారు. భయాందోళనలకి లోనవుతున్నారు. ఈ ఘటన వివరాలోకి వెళ్తే. అమెరికాలో ఎన్నో ఏళ్ళుగా నివాసం ఉంటున్న నాగప్ప అనే భారత ఎన్నారై, వృత్తి పరంగా ఐటీ ప్రొఫిషనల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఊహించని విధంగా కారులో ఓ శవాన్ని ఎక్కించుకుని అలాగే స్టేషన్ కి వెళ్లి తాను ఈ వ్యక్తిని హత్య చేశానని లొంగిపోయాడు.

ఈ ఘటనతో షాక్ తిన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని అతడు ఉండే ఇంటికి వెళ్లి పరిశీలించగా ఇంకా అక్కడ మరో నాలుగు మృతదేహాలు ఉండటం చూసి ఆశ్చర్య పోయారు. అతడిని విచారించినగా వారిని చంపింది కూడా తానే అని ఒప్పుకున్నాడు. అయితే చనిపోయిన్ అవారిలో ఇద్దరు పెద్దవాళ్ళు కాగా మరో ఇద్దరు చిన్న పిల్లలు కావడంతో అందరిని ఆ ఘటన కలిచి వేసింది.

 

అయితే ఎన్నారై వారిని ఎందుకు చంపాడు, అందుకు గల కారణాలు మాత్రం ఇప్పటికి తెలియరాలేదు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులకి మాత్రం సదరు భారత ఎన్నారై ఆర్ధిక ఇబ్బందులతో ఉన్నట్లుగా మాత్రం వివరాలు లభ్యమయ్యాయి. పూర్తి వివరాలు తెలిసిన తరువాత కోర్టులో జాజరుపరుస్తామని నేరం రుజువయ్యితే జైలు శిక్ష భారీగానే ఉంటుందని అంటున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version