Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన శాంతియాగం

-

తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతియాగం ప్రారంభమైంది. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావు కీలక ప్రకటన చేశారు. ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇవాళ ఉదయం 6 నుండి 10 గంటల వరకు శాంతి యాగం కొనసాగనుందని తెలిపారు ఈవో శ్యామలరావు.

Shanti Yagam started at Tirumala Srivari Temple

పంచ గవ్యాలతో సంప్రోక్షణ జరుగుతుందని చెప్పారు. లడ్డు పోటు పడిపోటులలో కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈవో శ్యామల రావు. కాగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంపై ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయంతో తిరుమలలో చోటు చేసుకున్న ఈ అపవిత్రత ఎవరివల్ల ఎందుకు జరిగిందనే విషయం బయటకు వస్తుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news