దొర గారికి దున్నపోతు మీద వానపడ్డట్టే ఉంది – షర్మిల ఫైర్‌

-

దొర గారికి దున్నపోతు మీద వానపడ్డట్టే ఉందని కేసీఆర్‌ పై షర్మిల ఫైర్‌ అయ్యారు. గతంలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడినా, ఇప్పుడు పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల కష్టార్జితం నీటిపాలైనా దొర గారికి దున్నపోతు మీద వానపడ్డట్టేనని ఆగ్రహించారు. TSPSC బోర్డు అంగట్లో సరుకులు అమ్ముతున్నట్లు.. క్వశ్చన్ పేపర్లు అమ్మకానికి పెట్టినా ఈ సర్కారుకు సిగ్గురాదని ఆగ్రహించారు. TSPSC స్కాం జరిగి, నెలన్నర దాటుతున్నా.. ఇప్పటివరకు ఒక్క రివ్యూ లేదు, మీటింగు లేదని మండిపడ్డారు.

నిరుద్యోగుల పక్షాన గళమెత్తితే పిరికిపందలా, అధికారమదంతో పోలీసులను పంపించడం, హౌజ్ అరెస్ట్ చేయించడం.. ఇది మాత్రం చేతనైంది కేసీఆర్ గారికి. స్కాంపై ఎలాంటి చర్యలు లేకుండానే పరీక్షలు నిర్వహించి, మళ్లీ క్వశ్వన్ పేపర్లు అమ్మి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా ఉన్నట్లుంది. వెంటనే TSPSC బోర్డును ప్రక్షాళన చేయాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిరుద్యోగుల మీద కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై CBI విచారణ జరిపించి, ఎంతటి దోషులనైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version