తెలంగాణను తాలిబాన్ల రాజ్యంగా మార్చాడు – వైఎస్ షర్మిల

-

తెలంగాణను తాలిబాన్ల రాజ్యంగా మార్చాడని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ పై వైఎస్ షర్మిల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది కేసీఆర్ గారి ప్రసంగం.”ప్రజల అభిప్రాయాలు గెలవాలట…ఇచ్చిన హామీలు నెరవేర్చాలట..” నీ ఏలుబడిలో ఏనాడైనా ప్రజలను గౌరవించావా? ప్రజాస్వామ్యవాదులను ఆదరించావా? కనీసం జర్నలిస్టులకైనా గౌరవం ఇచ్చావా? గడీ దాటి నీ అడుగు బయట పడితే.. అక్రమ అరెస్టులు అంటూ మండిపడ్డారు షర్మిల.

Sharmila comments on cm kcr

నెరవేర్చాలని శ్రీరంగనీతులు చెబుతుండు.. ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చావా? రైతు రుణమాఫీ ఏది? ఇంటికో ఉద్యోగం ఏది? డబుల్ బెడ్రూం ఇల్లు ఏది? దళితులకు మూడెకరాల భూమి ఏది? నిరుద్యోగ భృతి ఏది? పోడు పట్టాలు ఏవి? తెలంగాణను అప్పులపాలు చేసి పోలీసులను పనోళ్లలా వాడుకుంటూ, అక్రమ కేసులు బనాయిస్తూ,నియంత నిర్ణయాలతో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతూ తెలంగాణలో దొరల పాలన సాగిస్తూ తాలిబాన్ల రాజ్యంగా మార్చిండని కేసీఆర్ పై మండిపడ్డారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version