వైసీపీ కి పెద్ద షాక్..!

-

2024 ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కార్యకర్తలకి పిలుపునిచ్చారు. ఏపీలో టిడిపి అధికారంలోకి తీసుకువచ్చి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పుట్టపర్తి లో మాజీ మంత్రి నివాసంలో పది కుటుంబాలు మాజీమంత్రి డాక్టర్ పల్లి రఘునాథరెడ్డి నియోజకవర్గం పరిశీలకుడు మాజీ ఎమ్మెల్యే బచ్చల పుల్లయ్య సమక్షంలో టిడిపి కండువా కప్పుకుని వైసీపీ నుండి టిడిపిలోకి వచ్చేసారు.

Electoral Bonds to YCP Party Rs. 300 crores

మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని అన్నారు. ఈ 55 రోజులు టిడిపి విజయానికి అహర్నిశలు శ్రమించి పనిచేయాలని అన్నారు. ఎం శ్రీనివాసులు, వి రవి, అంజి, పి మణికుమార్, ఎం మారుతి, వై శ్రీకాంత్, ఎమ్ నారాయణప్ప తదితరులు టిడిపిలో చేరారు

 

Read more RELATED
Recommended to you

Latest news