ప్రియుడిని తలచుకొని ఎమోషనల్ పోస్ట్ చేసిన శృతిహాసన్..!

-

తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవితో వాల్తేరు వీరయ్య.. బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాలలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఈమె సినిమాల గురించి పక్కన పెడితే వ్యక్తిగతంగా ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తూ మరింత వైరల్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా తన బాయ్ ఫ్రెండ్ శాంతనుతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అతనిని తలుచుకొని ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది శృతిహాసన్. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.

తాజాగా శృతిహాసన్ తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా.. “ఈ ప్రపంచంలో నీకంటే సంతోషంగా నన్ను ఎవరు చూసుకోలేరు” అని తన ఇన్ స్టా స్టోరీలో రాసుకుంది. చాలా రోజుల తర్వాత శృతిహాసన్ ఈ పోస్ట్ పెట్టడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా శృతిహాసన్ ను తన బాయ్ ఫ్రెండ్ శాంతను చాలా సంతోషంగా చూసుకుంటున్నారని.. అభిమానులు సైతం తెగ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

ఇకపోతే శృతిహాసన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ సలార్ లో హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరికొన్ని ప్రాజెక్టులలో నటించడానికి సిద్ధమవుతోంది. మొత్తానికి సంక్రాంతి బరిలో దిగి.. ఏకైక హీరోయిన్ గా ఎన్నికైన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version