బ్రేకింగ్: సడెన్ గా గాంధీ ఆస్పత్రికి వెళ్ళిన సీతక్క… ఎందుకు…?

-

గత కొన్ని రోజులుగా కరోనా బాదితుల సమస్యలకు సంబంధించి పోరాటం చేస్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క… తాజాగా గాంధీ ఆస్పత్రికి వెళ్ళారు. పేషంట్ల బంధువుల ఇబ్బందుల పై ఆరా తీసారు. భోజనాలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గాంధీ హాస్పిటల్ వద్ద నీరు ఆహారం దొరక్క పేషంట్ల బంధువులు అవస్థలు పడుతున్నారు అని ఆమె ఆరోపించారు.

వారికి భోజనాలు పెడుతున్న రేవంత్ రెడ్డి ని అడ్డుకుని ప్రభుత్వం రక్షసంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మేము పెట్టం.. ఇతరులను పెట్టనివ్వం అనడం దుర్మార్గం అని ఆరోపించారు. మీరు పడుకుంటే పడుకోండి కానీ అన్నం పెట్టే వారిని అడ్డుకోకండి అని సూచించారు. వ్యక్తులు, సంఘాలు, సంస్థలు ఆహారం పంపిణీ చేయడం వల్లనే ఆకలి చావులు లేవు అని అన్నారు. ప్రభుత్వమే పేషంట్ల బంధువులకు భోజనం ఏర్పాటు చేయాలి అని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version