SLBC ప్రమాదం.. మంత్రులకు అదొక్కటే తెలుసు : హరీశ్ రావు ఫైర్

-

రాష్ట్రంలో ఎస్ఎల్‌బీసీ ప్రమాదం సంభవించి నేటితో 50 రోజులు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు ఈ ఘటనపై రేవంత్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ ఈ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీసి చేతులు దులుపుకున్నారని, మిగతా ఆరుగురి జాడ ఎప్పుడు కనుక్కుంటారని ప్రశ్నించారు.

ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, వాస్తవాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక మంత్రులకు హెలికాప్టర్‌లో తిరగడం తప్పా..బాధితుల కుటుంబాలకు ధైర్యం చెప్పే సమయం కూడా వారికి లేకుండా పోయిందని తీవ్ర విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news