గవర్నరా ఐ డోంట్ కేర్.. తమిళనాడు సీఎం సంచలన నిర్ణయం

-

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ రవి పెండింగులో పెట్టడంపై సుప్రీంకోర్టు ఇటీవల తీవ్రంగా తప్పుపట్డంతో పాటు ఆయన్ను మందలించిన విషయం తెలిసిందే. గవర్నర్ నుంచి ఆమోదం నెల రోజుల్లో రాకపోతే అవి ఆమోదం పొందినట్లే పరిగణించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఫాలో అవుతూ గవర్నర్ ఆమోదం లేకుండానే 10 బిల్లులకు సంబంధించి గెజిట్‌ను స్టాలిన్ సర్కార్ ప్రకటించింది.కొత్తగా ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం ఇక నుంచి తమిళనాడులోని అన్ని విశ్వవిద్యాలయాలకు చాన్సలర్ గా ముఖ్యమంత్రే వ్యవహరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news