సోషల్ వర్కర్ ఉద్యోగాలు… టెన్త్‌, ఇంటర్ పూర్తి చేసినవాళ్లు వెంటనే అప్లై చేయండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వికారాబాద్‌ జిల్లాలోని మిషన్ వాత్సల్య పలు పోస్టులని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే..

సోషల్ వర్కర్, అవుట్ రీచ్ వర్కర్, ఎస్‌ఏఏ మేనేజర్, ఎస్‌ఏఏ సోషల్ వర్కర్, ఆయా పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ని రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఇక అర్హత వివరాలను చూస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్‌/డిగ్రీ/పీజీ లేదా తత్సమాన కోర్సు చేసి ఉండాలి.

ఇక వయస్సు విషయానికి వస్తే.. 25 నుంచి 50 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసేందుకు చివరి తేదీ నవంబర్‌ 16, 2022. అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రూ.7,800ల నుంచి రూ.22,750ల వరకు సాలరీ ని ఇస్తారు. కింద వున్న అడ్రెస్ కి అప్లికేషన్ ని పంపించండి.

చిరునామా:

డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, Room No-58, విమెన్, చిల్డ్రన్, డిస్ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజెన్స్ డిపార్ట్మెంట్, న్యూ కలెక్టరేట్ కాంప్లెక్స్, వికారాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ-501101.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version