సీఎంగా ఉన్న జగన్‌ చర్చీలు, మసీదులు ఎలా కడతారు : సోము వీర్రాజు

-

సీఎంగా ఉన్న జగన్‌ చర్చీలు, మసీదులు ఎలా కడతారు..రాజ్యాంగంలో ఉన్న ఓ ముఖ్యమంత్రి ఆ పనులు చేయవచ్చా అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఏపీలో ఉన్న వైసీపీ మతతత్వ ప్రభుత్వమని… ఆత్మకూరులో అనుమతి లేకుండా రెండు రోజుల్లో ఇళ్ల మధ్య మసీదులు కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల మధ్య మసీదు వద్దని చెబితే చంపే ప్రయత్నం చేశారు..భయబ్రాంతులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చట్టాన్ని రక్షించాల్సిన ఉప ముఖ్యమంత్రి కాకమ్మ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు సోము వీర్రాజు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీ చేస్తామని… టీడీపీ నుండి బీజేపీకి వచ్చిన నేతలను కోవర్టులు అనటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీఆర్, మోదీతో పొత్తు పెట్టుకుని నల్ల జెండాలు చూపించారని… బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తామన్నారు. దేశంలో ఎన్నికలు జరిగే అన్నీ రాష్ట్రాల్లో అధికారం సాధిస్తామని.. ఏపీలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆగ్రహించారు.. పీఆర్సీ అర్ధం కాని బ్రహ్మ పదార్ధం అయ్యింది..యువతకు ఉద్యోగాలు ఇచ్చే అవసరం ఉండదనే ఉద్యోగులకు వయో పరిమితి పెంపు అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version