తనపై అరెస్టు వారెంట్ జారీ కావడంపై బాలీవుడ్ సినీ నటుడు సోనూసుద్ తాజాగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం చాలా బాధాకరమని, ఫిబ్రవరి 10న పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. ఈ విషయంలో అభిమానులు ఎటువంటి కంగారు పడవద్దని సోనూసుద్ సూచించారు.
కాగా, ప్రముఖ నటుడు సోనుసూద్కు లుధియానా కోర్టు అరెస్టు వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.ఓ మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి సోనుసూద్కు రాకపోవడంతో పంజాబ్ లుధియానా కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. లుథియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖాన్న తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు చెల్లించకుండా మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు.ఈ కేసులో సోనుసూద్ను సాక్షిగా పేర్కొన్నారు.అయితే, ఎన్నిసార్లు సమన్లు పంపినా అతను కోర్టుకు హాజరు అవ్వకపోవడంతో కోర్టు తాజాగా అరెస్టు వారెంట్ జారీ చేసింది.