బజార్ రౌడీల్లా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు : సోయం బాపు రావు

-

టిఆర్ఎస్ పార్టీ పై బిజేపి ఎంపీ సొయం బాపురావ్.. ఫైర్ అయ్యారు. హుజురాబాద్ ఓటమి తట్టుకోలేక వరి ధాన్యం పై రాద్దాంతం చేస్తున్నారని.. కేంద్రం వరి ధాన్యం కొనము అని ఎక్కడ చెప్పలేదని చురకలు అంటించారు. బజార్ రౌడీల లాగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు… పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ సొయం బాపురావ్..

బిజేపి ని బదనాం చేయడం కొసం తప్పా రైతులకు మేలు చేసే ఆలోచన టీఆర్ఎస్ కు లేదన్నారు. రైతుల మీద ప్రేమ ఉంటే రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీ ల కోసం మూడు సార్లు లేఖ లు రాశామని తెలిపారు. లేఖలు చదువరు.. కానీ బిజేపి మీద బురద జల్లుతున్నారని అగ్రహించారు ఎంపీ సొయం బాపురావ్. టీఆర్ఎస్ రైస్ మిల్లర్ల లాభం కోసం తప్పా రైతులకు లాభం కోసం పని చేయడం లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణ టిఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈనెల 15 న కేస్లా పూర్ కు తెలంగాణ గవర్నర్ వస్తారని తెలిపారు ఎంపీ సొయం బాపురావ్..

Read more RELATED
Recommended to you

Exit mobile version