ముంబై ఇండియన్స్ కి హార్దిక్ పాండ్యా…… తగ్గుతున్న ఫాలోవర్లు….

-

ముంబై జట్టును ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపిన రోహిత్ శర్మను ఆ జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పించి హార్థిక్ పాండ్యన్ కెప్టెన్ గా ఎన్నుకున్నారు. ఈ ప్రభావం ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలపై పడుతుంది. తమ అభిమాన ఆటగాడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించడం పలువురు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ యొక్క ఫాలోవర్స్ క్రమంగా తగ్గిపోతున్నారు. హిట్ మ్యాన్ కోసం మేము ఆ జట్టును సపోర్ట్ చేస్తున్నమని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నప్పుడు8.6 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుతం 8.2 మిలియన్ ఫాలోవర్లకి పడిపోయింది. దాదాపు నాలుగు లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయింది. అలాగే ఇంస్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్స్ ని కోల్పోతూ ఉంది. హార్థిక్ పాండ్య ని కెప్టెన్సీ చేయకముందు 13.1 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్న ముంబై ప్రస్తుతం 12.7 మిలియన్ల ఫాలోవర్స్ మాత్రమే కలిగి ఉన్నది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ కి రోహిత్ శర్మ ఆడకపోతే మరి కొంతమంది ఫాలోవర్స్ ని కోల్పోయిన ఆశ్చర్యము చెందాల్సిన పనిలేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news