జనసేన ఆ విషయాన్ని ఎక్కడ వెల్లడి చేయలేదు……. దగ్గుపాటి పురందేశ్వరి

-

జనసేన పార్టీతో తాము కూటమి ఏర్పాటు చేస్తున్నట్టు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటిశ్వరి స్పష్టం చేసింది. తాము జనసేన నుండి తెగదింపులు చేసుకోలేదని తెలిపారు. ఈ నిర్ణయాన్ని బిజెపి పెద్దలు మాత్రమే వెల్లడి చేస్తారని పేర్కొంది. ముందుగా ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో పర్యటించిన ఆమె అనంతరం దండమూడి లో జిల్లా కార్యకర్తలతో మాట్లాడింది.

పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర ప్రదేశ్ యొక్క రాజధాని అమరావతియే అని అలాగే రాజధాని అమరావతికి కేంద్రము నిధులు ఇచ్చింది అని పురందేశ్వరి గారు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఖర్చులన్నీటిని కేంద్రమే భరిస్తుందని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమే అని తెలిపింది. బిజెపి హయాంలో కేంద్ర ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావడంలేదని ఒకవేళ అడిగితే కేసులు తో వేధిస్తున్నారని చెప్పింది. నకిలీ ఓటర్ ఐడి లు సృష్టించి దొంగ ఓట్లు వేయడానికి సిద్ధమవుతున్నారని ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలతో ఆడుకుంటున్నారని కేవలం పిఎం ఆవాస్ యోజన కింద ఒక్క ఏలూరు జిల్లాకి లక్ష ఇల్లు మంజూరు చేశామని అన్నది.

Read more RELATED
Recommended to you

Latest news