ప్రపంచ కప్ ఫైనల్ లో సత్తా చాటిన భద్రాచలం యువతి..!

-

అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ లో భారత ప్లేయర్లు అదరగొట్టారు. మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా ఇవాళ సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. తుదిపోరులో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే కుప్పకూలింది. దీంతో అండర్ 19 టీ20 ప్రపంచ కప్ ను భారత్ సునాయసంగా గెలిచింది.

భారత బౌలర్లలో మరో భద్రాచలం యువతి గొంగిడి త్రిష సత్తా చాటింది. కీలక మ్యాచ్ లో గొంగడి త్రిష మూడు వికెట్లు పడగొట్టింది. ఆమెతో పాటు వైష్ణవి శర్మ 2, ఆయుషి శుక్లా 2, పరుణిక 2, షబ్నమ్ ఒక వికెట్ తీశారు. భారత బ్యాటర్లలో త్రిష 33 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. భారత్ 11.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. త్రిష 7 మ్యాచ్ లలో 309 రన్స్ చేసి భారత్ ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. యావరేజ్ 77, స్ట్రైక్ రేట్ 144 గా ఉండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news