IPL 2023 : RCBకి షాక్.. మ్యాచ్ టైంలో వర్షం?

-

 

ఐపీఎల్‌ 2023 లో భాగంగా ఇవాళ రెండు కీలక మ్యాచ్‌ లు జరుగనున్నాయి. ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, మధ్య 69వ మ్యాచ్ జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం అవుతుంది. అలాగే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్ మధ్య 70వ మ్యాచ్ జరుగనుంది.

బెంగళూరులోని.. ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌ 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇందులో బెంగళూరు, ముంబైకి ఈ రెండు మ్యాచ్‌ లు కీలకం. ఇందులో గెలిచిన జట్టు.. ప్లే ఆఫ్స్‌ కు చేరే అవకాశం ఉంది. అయితే.. ఇవాళ గుజరాత్-ఆర్సిబి మ్యాచ్ జరిగే బెంగుళూరులో వర్షం పడనుందని వార్తలు వస్తున్నాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా ఉరుములతో కూడిన వర్షం పడోచ్చని AccuWeather చూపిస్తోంది. వర్షం వల్ల మ్యాచుకు అంతరాయం కలిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ వర్షం తగ్గకుంటే మ్యాచ్ రద్దు చేసి రెండు టీం లకు చెరో పాయింట్ ఇస్తారు. అప్పుడు ఆర్సిబికి 15 పాయింట్లు అవుతాయి. ముంబై ఎస్ ఆర్ హెచ్ పై గెలిస్తే ఆర్సిబి ఇంటికి వెళ్లక తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version