24 ఏళ్ల తర్వాత కామన్‌వెల్త్‌ క్రీడల్లోకి క్రికెట్‌ రీఎంట్రీ..

-

అనేక దేశాల్లో జనరంజక క్రీడగా కొనసాగుతున్న క్రికెట్‌ కు కామన్వెల్త్‌ క్రీడల్లో మరోసారి స్థానం దక్కింది. ఈ సంవత్సరం ఇంగ్లండ్‌ లోని బర్మింగ్‌ హామ్‌ వేదికగా జరుగనున్న కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌ కు కూడా చోటు కల్పించారని ఐసీసీ ప్రకటన చేసింది. మలేసియాలో 1998 సంవత్సరంలో కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌ కు తొలిసారి స్థానం కల్పించారు.

అంటే 24 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఇప్పుడు కామన్‌ వెల్త్‌ లలో క్రికెట్‌ కు చోటు దక్కిందన్న మాట. అయితే.. ఈ పర్యాయం కేవలం మహిళల జట్లే బరిలో దిగుతాయని ఐసీసీ పేర్కొంది. టీ 20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో రెండు గ్రూప్‌ లు ఉన్నాయి. గ్రూప్‌ – ఏ లో టీమిండియా, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, బార్బడోస్‌ జట్టున్నాయి. గ్రూప్‌ బిలో శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లున్నాయి. జూలై 29 వ తేదీన తొలి మ్యాచ్‌ లో టీమిండియా, ఆసీస్‌ తలపడనున్నాయి. కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌ పోటీలు లీగ్‌ కమ్‌ నాకౌట్ పద్దతిలో నిర్వహించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version