టీం ఇండియా ఆడే వరల్డ్ కప్ మ్యాచ్ తేదీలలో మార్పులు …

-

ఈసారి క్రికెట్ వన్ డే వరల్డ్ కప్ 2023 ఇండియా వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. గత కొద్దీ రోజుల క్రితమే ఈ వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించింది. కానీ కొన్ని కారణాల వలన ఈ షెడ్యూల్ లో మార్పులు ఉంటాయని ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. కాగా ఇప్పుడు బీసీసీఐ మరియు ఐసీసీ చర్చించి ఈ రోజు కాసేపటి క్రితమే కొత్తగా వరల్డ్ కప్ షెడ్యూల్ ను ప్రకటించింది. కొత్తగా వచ్చిన షెడ్యూల్ ప్రకారం చూస్తే ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్యన జరగాల్సిన మ్యాచ్ అక్టోబర్ 14వ తేదీన అహమ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఇంకా ఇండియా నెదర్లాండ్ తో ఆడనున్న మ్యాచ్ కూడా నవంబర్ 11 నుండి నవంబర్ 12 కు మారింది. ఇంకా టోటల్ షెడ్యూల్ తో పోలిస్తే మొత్తం ఎనిమిది మ్యాచ్ ల షెడ్యూల్ మారాయి. దీనితో ఐసీసీ వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ ఖరారు అయింది.

ఇక ఇండియా వేదికగా ఈ వరల్డ్ కప్ జరుగుతున్నందున ఫేవరెట్ లుగా ఉండి టైటిల్ ను గెలుచుకుంటారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news