ఐపిఎల్ 2023: రాజస్థాన్ రాయల్స్ ఘోర ఓటమి… శాంసన్ భాయ్ ఏమి చేస్తున్నావ్ !

-

ఐపిఎల్ లో భాగంగా ఈ రోజు సంజు శాంసన్ నేతృత్వంలో రాజస్థాన్ రాయల్స్ మరియు హర్థిక్ పాండ్య నేతృత్వంలో గుజరాత్ టైటాన్స్ జట్లు జైపూర్ లో తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన సంజు ఎప్పటిలాగే బ్యాటింగ్ తీసుకున్నాడు. కానీ ఈ సారి తన అంచనా పూర్తిగా తప్పింది అని చెప్పాలి. జట్టు మొత్తం ఒకేసారి విఫలమై కేవలం 118 పరుగులకే ఆల్ ఔట్ అయ్యి అప్రతిష్ట మూటగట్టుకుంది. రషీద్ ఖాన్ మరియు నూర్ అహ్మద్ లు 5 వికెట్లు సాధించి రాజస్థాన్ ను దెబ్బ కొట్టారు. అనంతరం లక్ష్య చేదనలో గుజరాత్ కేవలం 13.5 ఓవర్ లలోనే టార్గెట్ చేరుకుని ఘన విజయాన్ని అందుకుంది.

గత మ్యాచ్ లో ఢిల్లీ పై 130 పరుగులు చేదించలేక చతికిలపడ్డ గుజరాత్ ఈ మ్యాచ్ లో కేవలం ఒక్క వికెట్ ను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ప్రస్తుతం రాజస్థాన్ వరుసగా 2 మ్యాచ్ లు ఓడిపోయి ప్లే ఆఫ్ కు చేరుతుందా అన్న సందేహాన్ని కలిగిస్తోంది. కెప్టెన్ సంజు శాంసన్ పదే పదె ఎందుకు టాస్ గెలవగానే బ్యాటింగ్ తీసుకుంటున్నాడు అని విమర్శలు వస్తున్నాయి. పైగా సంజు బ్యాటింగ్ లోనూ ఫెయిల్ అవుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version