IPL 2022 : RCBపై గ్రాండ్ విక్టరీ..పంజాబ్ ఫ్లేఆఫ్స్ అసలు సజీవం

-

ఐపీఎల్‌ 2022 లో కీలకమైన మ్యాచ్‌ లో ఆర్సీబీ చిత్తుగా ఓడింది. పంజాబ్‌ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ పై పంజాబ్ 54 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. బెంగళూరు బ్యాటర్లలో గ్లెన్‌ మ్యాక్స్‌ వెల్‌ 35, రాజత్‌ పాటిదార్‌ 26 పరుగులు, కోహ్లీ 20 పరుగులు చేసి.. పర్వాలేదనిపించారు.

డుప్లెసిస్‌ 10 పరుగులు, లామ్రోర్‌ 6 పరుగులు, దినేశ్‌ కార్తీక్‌ 11 పరుగులు, షాహ్‌ బాబ్‌ 9 పరుగులు, హర్షల్‌ పటేల్‌ 11 పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో రబాడ 3 వికెట్లు, రాహుల్‌ చాహర్‌ 2 వికెట్లు, రిషీ ధావన్‌ 2 వికెట్ల పడగొట్టి.. పంజాబ్‌ కు విక్టరీని అందించారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల చేసింది. దీంతో బెంగళూరుకు పంజాబ్‌ 210 భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ.. పంజాబ్‌ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 9 వికెట్ల నష్టాని కి 155 పరుగులే చేయగలిగింది.

Read more RELATED
Recommended to you

Latest news