పాకిస్తాన్ ప్లేయర్స్ కు జ్వరాలు…ఆందోళనలో టీం మేనేజ్మెంట్ !

-

వరల్డ్ కప్ లో కప్ ను గెలుచుకోలిగే జట్లలో ఒకటిగా ఎంటర్ అయిన పాకిస్తాన్ ఇప్పటి వరకు ఇండియా తో ఆడిన మ్యాచ్ మినహా పర్వాలేదనిపించే ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్ లో ఇండియా చేతిలో ఘోరంగా ఓడిపోయి ఎన్నో విమర్శలను కొని తెచ్చుకుంది.. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీలు వీరిని ప్రశ్నిస్తుండడం చాలా బాధాకరం అని చెప్పాలి. ఇదిలా ఉంటే… తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ ప్లేయర్స్ కు వైరల్ ఫీవర్ లు వచ్చాయట. అసలే ఓడిపోయిన బాధలో ఉన్న పాక్ కు ఇది పెద్ద సమస్య అని తెలుస్తోంది. పాకిస్తాన్ లో కీలక ఆటగాళ్లకు వైరల్ ఫీవర్ వచ్చినట్లు జట్టు యాజమాన్యం తెలియచేసింది. బెంగుళూరు వాతావరణ పరిస్థితులకు వీరు అనుకూలంగా లేనట్లు స్పష్టంగా అర్ధమవుతోంది.

 

ఈ కారణం వలనే వీరు అనారోగ్యానికి గురయినట్లు చెబుతున్నారు. అయితే శుక్రవారం ఆస్ట్రేలియా తో మ్యాచ్ ఉండడంతో ఇప్పుడు ఇలా జరుగుతోంది ఏమిటని జట్టు యాజమాన్యం తలలు పెట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version