IPL 2024: ధోని సూపర్ ఇన్నింగ్స్…ఢిల్లీ చేతిలో చిత్తు అయిన చెన్నై సూపర్ కింగ్స్

-

ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో మొదటి ఓటమిని చవిచూసింది చెన్నై సూపర్ కింగ్స్. పెద్దగా అంచనాలు లేని ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏకంగా 20 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. నిన్న జరిగిన మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లాలో ఐదు వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది.

Delhi Capitals won by 20 runs

రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, పృద్వి షా రాణించడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది ఢిల్లీ క్యాపిటల్స్. అనంతరం బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటి నుంచి తడబడుతూనే వచ్చింది. ఈ తరుణంలోనే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది చెన్నై సూపర్ కింగ్స్. దీంతో 20 పరుగులు తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. ఇక నిన్న ధోని అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 16 బంతుల్లో 37 పరుగులు చేశాడు ధోని. అటు రహానే, జడేజా, మిచెల్ చెన్నై ని గెలిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news