భారత్ కు చేరుకున్న హాకీ టీమ్.. దిల్లీలో గ్రాండ్ వెల్ కమ్

-

పారిస్ ఒలింపిక్స్లో సత్తా చాటి భారత్కు కాంస్య పతకాన్ని తెచ్చిన భారత పురుషుల హాకీ జట్టు ఇవాళ (శనివారం) దిల్లీ చేరుకుంది. దిల్లీ విమానాశ్రయంలో ఈ టీమ్కు ఘన స్వాగతం పలికింది. హాకీ టీమ్ ఈరోజు స్వదేశానికి వస్తుందని తెలియగానే ఉదయం నుంచే అభిమానులు భారీ సంఖ్యలో దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక ప్లేయర్లు రాగానే వారికి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. మరోవైపు అధికారులు బ్యాండ్, డప్పు చప్పుళ్లతో జట్టు సభ్యులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

బ్యాండ్ బాజాతో స్వాగతం పలకడంతో సంతోషంలో ప్లేయర్లు కూడా హుషారుగా స్టెప్పులేశారు. రోడ్డుపైనే డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. వెల్ కమ్ టూ ఇండియా ఛాంప్స్ అంటూ నెట్టింట ఈ టీమ్కు స్వాగతం పలుకుతున్నారు నెటిజన్లు. వెల్ డన్ బాయ్స్ అంటూ పొగుడుతున్నారు. ఇక గురువారం రోజున స్పెయిన్తో జరిగిన కాంస్య పతక పోరులో టీమిండియా 2-1 తేడాతో నెగ్గి కాంస్యం దక్కించుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version