ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఛాంపియన్గా… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. ఎవరు ఊహించని విధంగా 18 సంవత్సరాల తర్వాత ఛాంపియన్ అయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. పంజాబ్ కింగ్స్ జట్టు పైన ఏకంగా ఆరు పరుగులు తేడాతో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు…. అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది.

అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ఫైనల్ లో గెలిచిన రాజధాని బెంగళూరు జట్టుకు 20 కోట్ల ప్రైస్ మనీ దక్కింది. అలాగే ఫైనల్స్ లో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ కు 12.5 కోట్లు దక్కనున్నాయి. అటు ఫైనల్ గెలిచాక కంటతడి పెట్టుకున్నాడు విరాట్ కోహ్లీ. చివరి ఓవర్లోనే RCB విక్టరీ తేలిపోవడంతో.. మైదానంలో భావోద్వేగానికి లోనైయ్యాడు కోహ్లీ. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. తొలిసారి ఐపీఎల్ టైటిల్ సాధించింది బెంగళూరు జట్టు.