ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేదలకు అదిరిపోయే శుభవార్త అందింది. ఉపాధి హామీ శ్రామికులకు సంబంధించి వేతనాలను… మోడీ ప్రభుత్వం విడుదల చేసింది. మే నెల శ్రామికుల వేతనాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో… రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఏకంగా 1000 కోట్లు విడుదల చేయడం జరిగింది.

ఈ డబ్బులు శ్రామికుల అకౌంట్లో రెండు లేదా మూడు రోజుల్లో జమ కాబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు… కేంద్ర ప్రభుత్వం నుంచి 1100 కోట్లు రావాల్సి ఉంది. మరో 2500 కోట్లు మెటీరియల్ నిధులు కూడా పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా విడుదల కానున్నాయి. అయితే ప్రస్తుతానికి అయితే… కార్మికుల జీతాలు మాత్రం రెండు మూడు రోజుల్లో పడబోతున్నాయి. దీంతో సంబరాలు చేసుకుంటున్నారు కార్మికులు.