IND VS ENG : టాస్ గెలిచిన భారత్.. కొత్త ప్లేయర్ ఎంట్రీ

-

ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య ఇవాల్టి నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం లో జరుగుతుంది. ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ లో గెలిచిన ఇంగ్లాండ్ జట్టు… ఈ మ్యాచ్ లో కూడా తన పట్టు కొనసాగించాలని ప్లాన్ వేస్తోంది.

India vs England, 2nd Test

అటు సొంత గడ్డపై… విజృంభించి మళ్లీ దాడిలో పడేందుకు టీమిండియా కసరత్తు మొదలుపెట్టింది. ఇక ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య జరగనున్న రెండవ టెస్టు మ్యాచ్ ఇవాళ ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది.అయితే, విశాఖలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తరఫున రజత్ పాటీదార్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నారు.

 

ఇండియా : రోహిత్, జైస్వాల్, గిల్, శ్రేయస్, పాటీదార్, అక్షర్, భరత్, అశ్విన్, కుల్దీప్, బూమ్రా, ముఖేష్.

ఇంగ్లాండ్ : క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్ స్టో, స్టోక్స్, ఫోక్స్, రెహాన్, హార్ట్లీ, బషీర్, అండర్సన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version