T20 WorldCup 2024: ఐర్లాండ్ ను చిత్తు చేసిన టీమిండియా

-

T20 WorldCup 2024: ఐర్లాండ్ ను చిత్తు చేసింది టీమిండియా. టీ20 WC-2024లో టీమ్ ఇండియా బోణీ కొట్టింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచులో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐర్లాండ్ నిర్దేశించిన 97 పరుగుల లక్ష్యాన్ని 12.2 ఓవర్లలో ఛేదించింది. టీమ్‌ ఇండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ 52, పంత్ 36* రన్స్‌తో రాణించారు. భారత్ తన తర్వాతి మ్యాచును ఈనెల 9న పాకిస్థాన్‌తో ఆడనుంది.

India won by 8 wkts

కాగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో 4000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించారు. ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్ ఈ మార్క్ దాటారు. అలాగే తక్కువ బంతుల్లో 4వేల రన్స్ పూర్తి చేసుకున్న తొలి ప్లేయర్‌గానూ హిట్‌మ్యాన్ రికార్డులకెక్కారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version