బెంగుళూరు తొక్కిసలట ఘటనపై టైమ్స్ నౌ సంస్థ సంచలన విషయాలను వెల్లడించింది. ఇంత తక్కువ సమయంలోనే ఆర్సిబి జట్టు విజయోత్సవం జరిపించడం వద్దని చెప్పినా ఆర్సిబి యాజమాన్యం సభ్యులు అసలు వినిపించుకోలేదని పోలీసు వర్గాలు తెలిపినట్లుగా వెల్లడించారు. వారం రోజుల పాటు వేడుకలను వాయిదా వేయాలని చెప్పినప్పటికీ పట్టించుకోలేదని అన్నారు వారు అనుకున్న విధంగా వేడుక జరిగేందుకు రాజకీయ ఒత్తిడిని తీసుకువచ్చారు.

ఈ ఘటనకు గల ప్రధాన బాధ్యుడు ఆర్సిబి చైర్మన్ అని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ తొక్కిసలాట ఘటనలో 13 మంది మరణించారు. 30 మందికి పైనే తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు విరాట్ కోహ్లీని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంత్ కోహ్లీ తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ కి వెళ్లారు. కూలీ కోసమే ఇంత తొందరగా విజయోత్సవ కార్యక్రమం చేశారని సమాచారం అందుతోంది. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.