IPL 2023 : కొత్త కెప్టెన్‌ను అనౌన్స్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

-

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఐపిఎల్ 2023 సీజన్ మ్యాచ్ ల షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. మార్చి 31వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా కోల్‌ కత్తా నైట్‌ రైడర్స్‌ తమ కొత్త కెప్టెన్‌ గా అనౌన్స్‌ చేసింది. ఈ ఏడాదికి నితిష్‌ రాణానే టీం ను లీడ్‌ చేస్తారని ప్రకటన చేసింది కేకేఆర్‌ జట్టు.

శ్రేయస్‌ అయ్యర్‌ కు గాయం కావడంతో కేకేఆర్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక అటు క్రికెట్ అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు కామెంటేటర్ గా అవతారం ఎత్తేందుకు బాలయ్య సిద్ధమవుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బాలకృష్ణ కామెంటరీతో అదరగొట్టనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. మార్చి 31న ప్రారంభమయ్యే ఐపీఎల్ ఓపెనింగ్ రోజున బాలకృష్ణ కామెంటరీ ఉంటుందని చెప్పింది స్టార్ స్పోర్ట్స్. దీనికి సంబంధించి ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version