IND Vs NZ : తొలి టెస్ట్ లో న్యూజిలాండ్ ఘన విజయం

-

భారత్-న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 46 పరుగులకే కుప్ప కూలింది. దీంతో భారత్ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ పోరాడింది. కాకపోతే ఇన్నింగ్స్ తేడా లేకుండా 106 పరుగులు అదనంగా చేయగలిగింది. దీంతో న్యూజిలాండ్ జట్టు అలవొకగా ఛేదించింది.

రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్ 150, రిషబ్ పంత్ 99, విరాట్ కోహ్లీ 77, రోహిత్ శర్మ 52, యశశ్వి జైస్వాల్ 35 పరుగులు చేసి ఇండియాకి కీలక ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్ బ్యాటర్లు విల్ యంగ్ 45, రచిన్ రవీంద్ర 39 అద్భుతంగా ఆడి విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా విల్ యంగ్ ,  ఆలౌరౌండ్ షో ప్రదర్శించారు. అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్లు ఇద్దరూ టామ్ లాథమ్, కాన్వే  బుమ్రా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version