IPL 2024 : పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం

-

ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు క్రికెట్ డెవలప్మెంట్ హెడ్ గా భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ ను నియమించింది. వచ్చే సీజన్ లో హెడ్ కోచ్ ట్రేవర్ బేలిస్ తో కలిసి ఆయన ఆ పనిచేయనున్నారు. కాగా, సంజయ్ బంగార్ గతంలో కూడా పంజాబ్ ఫ్రాంచైజీకి సేవలు అందించారు. 2014 సీజన్ లో ఆ జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా, 2015, 16 సీజన్లలో హెడ్ కోచ్ గా పనిచేశారు.

Punjab Kings Crucial Decision

ఇది ఇలా ఉండగా, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ కోసం ఇవాళ ముంబైలో వేలం జరగనుంది. మొత్తం 165 మంది వేలం బరిలో నిలిచారు. భారత్ నుంచి 104 మంది, విదేశాల నుంచి 61 మంది వేలంలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. కాగా, మన్నత్ కశ్యప్, దేవికా వైద్య, vrindha… దినేష్ వేలంలో కోట్లు పలకనున్నట్లు తెలుస్తోంది. అలాగే టీం ఇండియా క్రికెటర్లు వేదా కృష్ణమూర్తి, పూనమ్ రౌత్, సుష్మ వర్మ, ఏక్తాభిస్త్ లు కూడా మంచి ధర పలికే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version