విరాట్ కోహ్లీకి కీలక బాధ్యత అప్పగించిన రాహుల్ ద్రావిడ్

-

టీమిండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ తన ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఆఖరి రోజు కూడా విధులను నిర్వర్తించిన ద్రవిడ్.. వెళ్తూ వెళ్తూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఓ బాధ్యతను అప్పగించాడు. టెస్టుల్లోనూ టీమ్‌ ఇండియా ఛాంపియన్‌గా నిలపాలని అన్నాడు. ‘‘తెల్లబంతితో ఆ మూడూ మనం సాధించాం. ఇక ఎరుపే ఉంది. అది కూడా సాధించండి’’ అని డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోహ్లితో ద్రవిడ్‌ చెప్పిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ద్రవిడ్‌ చెప్పిన మూడు అంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మూడు ప్రపంచ ట్రోఫీలు. ఒకటి టీ20 ప్రపంచ కప్, రెండోది వన్డే ప్రపంచ కప్‌.. మూడోది ఛాంపియన్స్‌ ట్రోఫీ. ఆటగాడిగా కోహ్లి ఈ మూడూ గెలిచిన విషయం తెలిసిందే. ఇక మిగిలింది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్. భారత జట్టు రెండు సార్లు.. 2021, 2023లో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్‌ గెలిచాక కోహ్లి అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version