ఆర్సీబీ గెలుపు సంబరాలు.. ఇద్దరు అభిమానులు మృతి

-

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సిబి జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల అనంతరం ఆర్సిబి జట్టు కప్పు గెలవడంతో ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాలలో భాగంగా కొంతమంది మరణించడం కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే కర్ణాటకలోని బెలగావి ప్రాంతంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. ఆర్సిబి గెలుపు సాధించిన క్రమంలో సంబరాలు జరుపుకుంటున్న ఓ అభిమాని మృతి చెందాడు.

RCB victory celebrations Two fans die
RCB victory celebrations Two fans die

మంజునాథ వీరప్ప కంబార్ (28) నిన్న స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఆ సమయంలో డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో మరణించాడు. మంజునాథ ఈరప్ప కంబార్ భార్య ప్రస్తుతం గర్భిణీ. మంజునాథ మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు విజయవాడలో మరో వ్యక్తి ఆర్సిబి సంబరాలు చేసుకుంటున్న సమయంలో బైక్ పైన వెళ్తూ కిందపడి శేఖర్ (30) అనే వ్యక్తి మరణించాడు.

Read more RELATED
Recommended to you

Latest news