కొండగట్టులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొన్ని గంటల్లోనే పెళ్లి ఉండగా… ఇంతలో పెను విషాదం జరిగింది. కారులో పెళ్లి మండపానికి వెళుతుండగా… ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండగట్టు వద్ద డీసీఎం ను… వేగంగా వెళ్లి పెళ్లికి సంబంధించిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో పెళ్ళికొడుకు కారులోనే ఉన్నాడు.

ప్రమాదం జరగగానే కార్లో ఉన్న ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. పెళ్ళికొడుకుకు అలాగే మరో ఆరు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం జరగడంతో వివాహ వేడుకలు ఆగిపోయాయి. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఇంతలోనే తీవ్ర విషాదం..
కారులో పెళ్లి మండపానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
కొండగట్టు వద్ద డీసీఎంను ఢీకొట్టిన కారు
ఓ చిన్నారి మృతి, పెళ్లి కొడుకుతో పాటు ఆరుగురికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంతో ఆగిపోయిన వివాహ వేడుకలు pic.twitter.com/qLj7BjEwVW
— BIG TV Breaking News (@bigtvtelugu) June 5, 2025