Rohit Sharma : దూబే, జితేశ్ అద్భుతంగా ఆడారు : రోహిత్ శర్మ

-

ఆఫ్ఘనిస్తాన్ తో తొలి టీ20 లో శివమ్ దూబే, జితేష్ శర్మ అద్భుతంగా ఆడారని కెప్టెన్ రోహిత్ శర్మ కొనియాడారు. తిలక్ వర్మ, రింకు సింగ్ తో పాటు పెసర్లు, స్పిన్నర్లు మంచి ప్రదర్శన చేశారని చెప్పారు. మ్యాచ్ లో తన రనౌట్ పై స్పందిస్తూ…. “ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఆటగాడు జట్టు విజయంలో భాగం కావాలనుకుంటాడు. దురదృష్టవశాత్తు రనౌట్ అయితే నిరాశకు గురవుతాడు. ఏది ఏమైనాపటికి మేము గెలిచాం” అని తెలిపారు.

Rohit Sharma comments on dube and jitesh

కాగా, అఫ్గానిస్తాన్ తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇండియా విజయంతో ఆరంభించింది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో అఫ్గానిస్తాన్ నిర్దేశించిన 159 రన్స్ లక్ష్యాన్ని ఇండియా.. 17.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.జితేశ్‌ శర్మ (20 బంతుల్లో 31, 5 ఫోర్లు), శివమ్‌ దూబే (40 బంతుల్లో 60 నాటౌట్‌, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్‌ వర్మ (22 బంతుల్లో 26, 2 ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించడంతో ఇండియా బోణీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version