కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్మృతి మందాన

-

భారత మహిళా క్రికెట్‌ జట్టు సభ్యురాలు, స్టార్ బ్యాటర్‌ స్మృతి మందాన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం కుటుంబసమేతంగా తిరుమలకు వెళ్లిన స్మృతి మందాన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు స్మృతి మందానకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మందాన కుటుంబసభ్యులు కషాయ శాలువాలు కప్పుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు.

కాగా, ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో స్మృతి భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్మృతి మందాన 149 పరుగులు చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 603 పరుగులు భారీ స్కోర్‌ సాధించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version