IPL 2025 రద్దు చేసే దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ IPL రద్దు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై లీగ్ చైర్మన్ అనిల్ ధుమాల్ స్పందిస్తూ.. ‘పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.

అన్నింటిని దృష్టిలో పెట్టుకుని లీగ్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. కాగా, పాక్ దాడుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ రద్దు అయింది. పాక్, ఇండియా వార్ ప్రభావం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మ్యాచ్పై పడింది. జమ్మూ ఎయిర్ పోర్టు పై పాక్ దాడి చేయడంతో అప్రమత్తమైన సైన్యం ధర్మశాలలోనూ బ్లాక్ అవుట్ ప్రకటించింది. విద్యుత్ సరఫరా ను నిలిపివేసింది. ఫ్లడ్ లైట్స్ బంద్ కావడంతో సగంలోనే మ్యాచ్ నిలిచిపోయింది.