రాణించిన పంజాబ్.. హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే..?

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణిత  20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. అథర్వ (46), ప్రభుసిమ్రాన్ సింగ్ 71 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే రోస్సో కూడా 49 పరుగులు చేశాడు.

జితేష్ శర్మ ఇవాళ 32 పరుగులు చేసి చివరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే సన్ రైజర్స్ బౌలర్ల భువనేశ్వర్ కుమార్ వికెట్లు ఏమి తీయలేదు. నాలుగు ఓవర్లు వేసి 36 పరుగులు సమర్పించుకున్నాడు. పాట్ కమ్మిన్స్ 4 ఓవర్లు వేసి 36 పరుగులు సమర్పించుకొని ఒక వికెట్ తీశాడు. నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. 33 పరుగులు ఇచ్చాడు. విజయ్ కాంత్ 37 పరుగులు ఇచ్చాడు. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి కేవలం 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 54 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి బంతికి కూడా జితేష్ శర్మ సిక్స్ తో ముగించేశాడు. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఛేదిస్తుందో లేదో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news