తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ … తొలి మ్యాచ్ లోనే విజయం !

-

ఈ రోజు నుండి దేశవాళీ టోర్నీలలో భాగంగా సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 టోర్నమెంట్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ లో తలపడిన హైద్రాబాద్ మేఘాలయ పై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ఈ సీజన్ ను విజయంతో స్టార్ట్ చేసింది. ఈ సీజన్ కు గాను హైదరాబాద్ జట్టు యాజమాన్యం లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ తిలక్ వర్మ ను సారధిగా నియమించింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన మేఘాలయ జట్టు నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. అనంతరం పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 40 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ తిలక్ వర్మ 31 బంతుల్లో 3 ఫోర్లు మరియు 2 సిక్సులతో 2 పరుగులు చేశాడు. ఇతనికి తన్మయ్ అగర్వాల్ (46) నుండి చక్కని సహకారం లభించింది.

ఇండియా క్రికెట్ జట్టులో సభ్యుడుగా ఉన్న తిలక్ వర్మ జాతీయ టోర్నీలలోనూ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version