IPL 2023 : ఉప్పల్ స్టేడియంలో VRAల నిరసన

-

ఐపిఎల్ 2023 లో మొదటి ఆదివారం డబుల్ హెడర్ లో భాగంగా రాజస్థాన్ మరియు హైదరాబాద్ ల మధ్యన ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరిగింది. ముందుగా హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. బ్యాటింగ్ తీసుకున్న రాజస్థాన్ నిర్ణీత ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసి హైదరాబాద్ ముందు 204 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

కానీ ఆ లక్ష్యాన్ని.. హైదరాబాద్ చేధించలేక ఓడిపోయింది. అయితే, ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో TS VRA లు దర్శనమిచ్చారు. నిన్న సన్రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ కు హాజరైన విఆర్ఏలు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ‘మాకు పే స్కేల్ అమలు చేయాలి’ అని ప్లకార్డుపై రాసి, ప్రేక్షకుల మధ్య నిల్చోని తమ గోడును వినిపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version